
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్లో ఉన్నాడు! వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్, ఇప్పుడు కెరీర్లో అరుదైన ఘనత సాధించబోతున్నాడు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధంగా ఉంది. అటు ‘ఓజి’ కూడా థియేటర్లలోకి రానే రాబోతుంది. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పవన్ మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు.
పవన్ కెరీర్లో ఒకే ఏడాది రెండు సినిమాలు రావడం రేర్. 2006లో ‘బంగారం’, ‘అన్నవరం’ సినిమాలు ఏడు నెలల గ్యాప్తో వచ్చాయి. ఆ రికార్డ్ ఇప్పుడు 2025లో రిపీట్ కాబోతోంది. కేవలం మూడు నెలల వ్యవధిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రిలీజ్ డేట్స్లో చిన్న మార్పు ఉన్నా, ఈ రెండు సినిమాలూ ఈ ఏడాది రావడం పక్కా. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత పవన్ ఈ అరుదైన ఫీట్ను సాధించబోతున్నాడు. ఈ విషయంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. పవన్ డబుల్ ధమాకాతో బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం.