
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. జ్యోతికృష్ణ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. అయితే, జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు ప్రకటించిన థియేటర్ల బంద్ ఈ సినిమా రిలీజ్పై నీలినీడలు కమ్మేస్తోంది. అద్దె విధానం వల్ల నష్టాలు రావడంతో షేర్ బేసిస్కు మారాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ప్రొడ్యూసర్లు సహకరించకపోతే బంద్ కొనసాగుతుందని హెచ్చరించారు. దీంతో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ వాయిదా పడుతుందేమోనని పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సమస్య త్వరగా పరిష్కారమైతేనే రిలీజ్ షెడ్యూల్లో మార్పు ఉండకపోవచ్చు. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.