
రితేష్ రాణా దర్శకత్వంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్ తదితరులు లీడ్ రోల్స్ లో నటిస్తూ క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా మత్తు వదలరా 2. మత్తు వదలరా అనే సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కావడం జరిగింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సినిమా టీం సక్సెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా….
నటుడు రాజా మాట్లాడుతూ… చిన్న సినిమా అయినా ఇంతగా ఆదరించి మంచి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. ఇలాగే కొనసాగాలి అనుకుంటున్నాను.
దర్శకుడు రితేష్ రాణా మాట్లాడుతూ… సినిమాను ఇంత మంచి విజయం సాధించేలా చేసినందుకు చాలా సంతోషం.
ప్రొడ్యూసర్ చెర్రీ మాట్లాడుతూ… సినిమా ఇంత మంచి విజయం సాధించడానికి ముఖ్య కారణం రితేష్ రాణా & టీం. ప్రేక్షకులు ఎంతగానో సినిమాను ఎంజాయ్ చేసినట్లు ప్రేక్షకులు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. సినిమా దసరా వరకు నడుస్తుంది అని అనుకుంటున్నాను. మీడియా వారికి కృతజ్ఞతలు.
మైత్రి యలమంచిలి రవి శంకర్ : మాకు ఇంతగా సపోర్ట్ ఇచ్చిన మీడియాకు కృతజ్ఞతలు. మా అంచనాలను మించి 30 కోట్లకు పైగా రావడం చాల సంతోషంగా ఉంది. వీటిలో సుమారు 10 కోట్లు ఓవర్సీస్ నుండి రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇదే ఉత్సాహంతో మత్తు వదలరా 3 కూడా తీస్తాం అని ప్రకటిస్తున్నాను. ఇలాంటి విజయం వచ్చేలా ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. ప్రభాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమాను ఆదరించిన మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, రాజమౌళి గారికి అలాగే అందరికీ థాంక్స్.
హిరోయిన్ ఫరియా అబ్దుల్ల: నన్ను ఆదరించిన అభిమానులకు చాల థాంక్స్. మాములుగా హిరోయిన్ కు వచ్చే కలెక్షన్స్ తో పని ఉండదు కానీ ఈ సినిమాతో వచ్చిన కలెక్షన్స్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. నేను పార్ట్ 3 లో ఉండకపోవచ్చు అని డైరెక్టర్ అన్నారు కానీ నన్ను కచ్చితంగా నన్ను పార్ట్ 3లో మీరు తీసుకోవాల్సిందే. మా ఫ్యాన్స్ ఒప్పుకోరు లేకపోతే. మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
హీరో శ్రీసింహ: మేము అనుకున్నాడానికి మించి ఇంత మంచి విజయం రావడం చాల సంతోషాన్ని ఇచ్చింది. దీనికి కారణం అయిన మీడియా & ప్రేక్షకులకు థాంక్స్. నేను కూడా పార్ట్ 3 కోసం వేచి చూస్తున్నాను. మా సినిమా డైరెక్షన్ టీంకి చాలా థాంక్స్.