తెలుగు థియేటర్ల బంద్ షాక్ – జూన్ 1 నుంచి సినిమాలు ఆగనున్నాయా?

Screenshot 2025 05 18 181317

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో 65 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని, అద్దె ప్రాతిపదికన సినిమాల ప్రదర్శన వల్ల నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై షేర్ బేసిస్‌లోనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, గిల్డ్‌లకు తెలియజేయనున్నారు. ప్రొడ్యూసర్లు సహకరించకపోతే, జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. జూన్‌లో రిలీజ్ కానున్న సినిమాల భవిష్యత్తు అనిశ్చితంలో పడింది. సినీ అభిమానులు, నిర్మాతలు ఈ బంద్ పిలుపుతో ఆందోళనలో ఉన్నారు. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తేనే థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది.