
పూరి జగన్నాథ్ తనదైన శైలిలో మరో సినిమాటిక్ సంచలనానికి రెడీ అవుతున్నాడు. విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి, రాజకీయ సెటైర్లతో నిండిన ఓ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సమకాలీన సమాజాన్ని ఆకట్టుకునే ఈ సినిమాలో విద్యా బాలన్ రాజకీయ నాయకురాలిగా నటిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. పూరి సినిమాల్లోని పాత్రల డెప్త్, డైనమిక్ స్క్రీన్ప్లే ఈ చిత్రంలోనూ హైలైట్ కానున్నాయి.
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై వచ్చిన విమర్శలను అధిగమించేందుకు, పూరి ఈసారి గట్టి కథనం, బలమైన స్క్రిప్ట్తో సిద్ధమయ్యాడు. రామ్ పోతినేనితో వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, విజయ్ సేతుపతి లాంటి టాలెంటెడ్ యాక్టర్తో పూరి మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమా పూరికి బ్లాక్బస్టర్ హిట్గా మారుతుందా? అనేది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.