నూతన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారిని కలిసిన సంగీత దర్శకుడు కోటి

WhatsApp Image 2026 08 28 at 4.48.47 PM

ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబిసి) చైర్మన్ గా ఎంపికైన శ్రీధర్ వర్మ గారిని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సాహిత్య పరంగా తన వంతు సేవను అందిస్తానని కోటి అన్నారు. చైర్మన్ శ్రీధర్ వర్మ గారు, సంగీత దర్శకుడు కోటి కలిసి ఈ విషయాలపై చర్చలు జరిపారు. ఎస్విబిసి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని కోటి ఆకాంక్షిస్తూ ఆయనను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ గారు సంగీత దర్శకుడు కోటి గారిని సత్కరించడం జరిగింది.