ఘనంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రముఖ నటుడు జెమిని సురేష్ ముఖ్యపాత్రలో అఖిల నాయర్ తో జంటగా సమ్మట గాంధీ, బలగం విజయలక్ష్మి, చింటూ ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.వి.గోపి డిఓపిగా చేయగా రాఘవేంద్ర రెడ్డి ఎడిటింగ్ చేస్తున్నారు. సోమేశ్వరరావు నిర్మాతగా రానున్న ఈ చిత్రానికి అర్థం వారాహి శ్రేయాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర కథను నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అలాగే జెమిని కిరణ్ గారి చేతుల మీదగా అందుకోగా తొలిగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమిని సురేష్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి గారు ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెమిని సురేష్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను మీ జెమిని సురేష్. ఇది నా తొలి చిత్రం. నా 18 సంవత్సరాల కల నేడు నెరవేడబోతుంది. ఒక మంచి కథతో ప్రేక్షకులు ముందుకు రావాలి అని అనుకున్నాను. ఒక మంచి కథతో నాకు శ్రీనివాస్ గారు ఆత్మకథ చిత్రంతో అవకాశం ఇచ్చారు. నా ఈ చిత్ర పూజ కార్యక్రమానికి నాకు దేవుడు ఇలాంటి వ్యక్తి జెమిని కిరణ్ గారు వచ్చి ఆశీర్వదించినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు పాల్గొనడం సంతోషకరం. అలాగే దండు శ్రీనివాస్ రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా తొలి చిత్రానికి మా అమ్మ చేతిలో మీదగా క్లాప్ కొట్టడం అనేది మరింత సంతోషకరం. అలాగే సమ్మట గాంధీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా నుండి వచ్చిన తొలి హీరో నేనే కాబట్టి మీడియా వారు ఉంటే నాకు కచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రేక్షకులు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటి అఖిల మాట్లాడుతూ… “మా చిత్ర బృందానికి అందరికీ ఆల్ ద బెస్ట్ చేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, జెమిని సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సీనియర్ నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ… “ఆత్మకథ అనే చిత్రంలో నటించే అవకాశం నాకు జెమిని సురేష్ ద్వారా వచ్చింది. దానికి గాను జెమినీ సురేష్ కి ధన్యవాదాలు. ఈ చిత్ర దర్శకులు శ్రీనివాస్ గారికి నిర్మాతలకు అలాగే ఇతర నటీనటులకు, సాంకేతిక బృందం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో కీలకం. ఇటీవల కాలంలో ఇటువంటి చిత్రం రాలేదు. మరొకసారి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు.

దర్శకులు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నేను ఇప్పటికే ఒక హిందీ సినిమాకు, నాలుగు కన్నడ చిత్రాలకి అలాగే ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించాను. కథని హీరోగా అనుకుని ఆత్మకథ అనే చిత్రాన్ని రచించాను. ఈ చిత్రంలో జెమిని సురేష్ గారు, సమ్మటి గాంధీ గారు రెండు స్తంభాలు వంటి వారు. నన్ను నమ్మి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే శ్రేయాస్ ను అతి చిన్న వయసులోనే సంగీత దర్శకునిగా తీసుకోవడానికి కారణం అతని టాలెంట్. ఈ చిత్రాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకులు శ్రేయాస్ మాట్లాడుతూ… “నా పేరు శ్రేయాస్. గ్రేడ్ 6 చదువుతున్నాను. నేను ఇప్పటికే ఐదు ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తున్నాను. ఎన్నో సంగీత కోర్సులు కూడా నేర్చుకున్నాను. చిత్ర బృందం అందరికీ థాంక్స్” అన్నారు.

తారాగణం:
జెమిని సురేష్, అఖిలా నాయర్, సమ్మేట గాంధీ, బలగం విజయలక్ష్మి, చిన్ను, ధనరాజ్, తగుబోతు రమేష్, మహేశ్ విట్ట, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, డి. సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్

బ్యానర్: వారాహి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
కథ – స్క్రీన్‌ప్లే – సంభాషణలు – దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి
సహ దర్శకుడు: మన్యం దేవేంద్ర
నిర్మాతలు: వారాహి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
ఛాయాగ్రాహకుడు (DOP): ఎం.వి. గోపీ
ఎడిటర్: రాఘవేంద్ర రెడ్డి
కస్టమ్ డిజైనర్ : రామారావు
స్టిల్స్: బి. శ్రీకాంత్ రెడ్డి
పిఆర్ఓ : మధు వీఆర్
డిజిటల్ : డిజిటల్ మీడియా
మ్యూజిక్ : అర్థం వారాహి శ్రేయాస్
ప్రొడక్షన్: నిమ్మల గంగాధర్