
మాస్ ప్రేక్షకుల అభిరుచిని అద్భుతంగా అర్థం చేసుకుని వరుస బ్లాక్బస్టర్లు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్ను తనదైన శైలిలో చూపిస్తూ ‘భద్ర’, ‘సింహ’, ‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘అఖండ’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎంతోమంది కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించిన దర్శకుడిగానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
ఇప్పుడు థియేటర్లలోనే కాదు, డిజిటల్ వేదికపైనా బోయపాటి తన సత్తా చాటారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘ఖూంఖార్’ యూట్యూబ్లో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. 2019లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి సినిమాగా నిలిచింది.
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది కేవలం వ్యూస్ రికార్డు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తన సినిమాపై చూపించిన ప్రేమకు నిదర్శనమని అన్నారు. ఈ ఘనతతో బోయపాటి శ్రీను మాస్ దర్శకుడిగానే కాకుండా, డిజిటల్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ను మరింత బలంగా నిలబెట్టుకున్నారు.
