
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ భార్య డాక్టర్ పల్లవి వర్మ ఈరోజు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా వున్నారు. ఈ సందర్భంగా నిఖిల్, పల్లవి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రికి వెళ్లి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటోలను పంచుకున్నారు నిఖిల్. సందర్భంగా నిఖిల్ అభిమానులు,స్నేహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2020లో నిఖిల్, పల్లవిల వివాహం జరిగింది.