రఘుకు సినీ ప్రముఖుల నివాళి

Raghu

ఫిల్మ్ నగర్, న్యూస్టుడే: ఫిల్మ్నగర్ కో-ఆపరేటివ హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యుడు వి. రఘు (52) ఆదివారం కన్నుమూశారు. ఉదయం షేక్పటలోని ఓ అపార్ట్మెంట్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఆయన మృతి చెందారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న రఘు ఫిల్మ్నగర్ పరి సర ప్రాంతాల వారికి, సినీ ప్రముఖులకు సుప రిచితుడే. ఆయనకు భార్య, కుమారుడున్నారు. సినీ నిర్మాతలు డి. సురేష్బాబు, దామోదర ప్రసాద్, నటుడు అశోక్ కుమార్, హౌసింగ్ సొసైటీ కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి కోటిబాబు, సభ్యులు ఎన్. భాస్కర్నాయుడు, జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ తదిత రులు రఘు భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యు లను పరామర్శించి సానుభూతి తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుతామని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.