
టాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘పెదరాయుడు’ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నటుడు మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ను కలిసి సంబరాలు జరుపుకున్నారు. 1995 జూన్ 15న విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించగా, మోహన్ బాబు డ్యుయల్ రోల్తో, రజినీకాంత్ ‘పాపా రాయుడు’ పాత్రలో అలరించారు. సౌందర్య, భానుప్రియ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా, కోటి సంగీతంతో సూపర్ హిట్ అయింది.అవార్డులు, రికార్డు కలెక్షన్లతో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ‘కన్నప్ప’ ప్రమోషన్స్లో భాగంగా రజినీతో కలిసిన మోహన్ బాబు, ఈ సినిమా విజయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘పెదరాయుడుతో పాపా రాయుడు’ అన్న రజినీ కామెంట్ నెట్టింట వైరల్గా మారింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని చూసిన రజినీ, టీమ్ను ప్రశంసించారు.