
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అభిమానులను ఉర్రూతలూగించి, సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రూ.105 కోట్ల భారీ ఒప్పందంతో సొంతం చేసుకుందని సమాచారం. ఈ డీల్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్. ‘పెద్ది’తో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.