
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణం’ సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027లో రెండో భాగం విడుదల కానున్నాయి. ఇందులో సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే, శూర్పణఖ పాత్ర కోసం హీరోయిన్ ఎంపిక చర్చనీయాంశమైంది. మొదట ఈ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా, ఆమె రాజమౌళి-మహేశ్బాబు సినిమా (SSMB29)తో బిజీగా ఉండటంతో రకుల్ ప్రీత్ సింగ్ను సంప్రదించారట. ఈ భారీ ప్రాజెక్ట్లో భాగమవ్వడం రకుల్కు థ్రిల్గా ఉందని, ఆమె వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శూర్పణఖ లుక్ టెస్ట్ కోసం రకుల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమేనా అన్నది తెలియాల్సి ఉంది. రకుల్ ప్రస్తుతం ‘ఇండియన్ 3’, ‘దేదే ప్యార్ దే 2’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.