మరోసారి పవన్ కళ్యాణ్ – సముద్రఖని కాంబో

Screenshot 2025 06 14 154813

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖనితో జతకట్టబోతున్నారు. వీరి కాంబోలో వచ్చిన ‘బ్రో’ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ రీమేక్‌గా తెరకెక్కి ప్రేక్షకుల మనసు గెలిచింది. ఇప్పుడు ఈ హిట్ జోడీ మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. పవన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ చిత్ర నిర్మాత ఎవరు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ నటించబోతున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు మరో విభిన్న అనుభవాన్ని అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘బ్రో’లాగే ఈ చిత్రం కూడా ఎమోషనల్ డ్రామాతో పాటు బలమైన సందేశాన్ని కలిగి ఉంటుందని టాక్. పవన్ రాజకీయ, సినీ బిజీ షెడ్యూల్‌లో ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అవుతుందో చూడాలి.