
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖనితో జతకట్టబోతున్నారు. వీరి కాంబోలో వచ్చిన ‘బ్రో’ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ రీమేక్గా తెరకెక్కి ప్రేక్షకుల మనసు గెలిచింది. ఇప్పుడు ఈ హిట్ జోడీ మరో కొత్త ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టబోతోంది. పవన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ చిత్ర నిర్మాత ఎవరు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ నటించబోతున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు మరో విభిన్న అనుభవాన్ని అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘బ్రో’లాగే ఈ చిత్రం కూడా ఎమోషనల్ డ్రామాతో పాటు బలమైన సందేశాన్ని కలిగి ఉంటుందని టాక్. పవన్ రాజకీయ, సినీ బిజీ షెడ్యూల్లో ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అవుతుందో చూడాలి.