త్రివిక్రమ్ లైనప్ పై నాగవంశీ క్లారిటీ

Screenshot 2025 06 13 123255

స్టైలిష్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన మాటల మజిక్‌తో టాలీవుడ్‌ను ఊపేయడానికి సిద్ధమవుతున్నారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ నుంచి కొత్త సినిమా ఇంకా సెట్స్‌పైకి రాలేదు. మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మాస్ ఐకాన్ ఎన్టీఆర్‌కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ లైనప్‌పై గత కొంతకాలంగా రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, విక్టరీ వెంకటేష్‌లతో సినిమాలు అంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు. త్రివిక్రమ్ ప్రస్తుతం కేవలం ఎన్టీఆర్, వెంకటేష్‌లతోనే సినిమాలు చేస్తున్నారని, ఇతర హీరోలతో ఎలాంటి ప్రాజెక్ట్ ఫిక్స్ కాలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రేజీ కాంబోలు బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తాయో చూడాలి.