‘ఘాటి’తో అనుష్క ఘాటుగా థియేటర్లలోకి

Screenshot 2025 05 22 082700

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఘాటి’ కోసం అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అనుష్క శక్తిమంతమైన పాత్రలో మెరవనుంది. టీజర్, పోస్టర్లు అంచనాలను పెంచాయి. రిలీజ్ వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందినప్పటికీ, జూలై 11న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు నిర్మాతలు సిద్ధమయ్యారు.

విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించనుండగా, విద్యా సాగర్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సన్నద్ధమవుతోంది. అనుష్క తన నటనా ప్రతిభతో మరోసారి ఆకట్టుకోనుందని అందరి ఆశ.