ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ యాక్షన్‌ డ్రామా: హైదరాబాద్‌లో భారీ సెట్స్‌

Screenshot 2025 05 14 162025

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. జూన్‌ మూడో వారం నుంచి హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాల షూటింగ్‌ ప్రారంభం కానుంది. హై-ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ఎన్టీఆర్‌తో పాటు ప్రకాష్‌ రాజ్‌, ఇతర కీలక నటీనటులు ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ‘డ్రాగన్‌’గా పిలువబడుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఐకానిక్‌గా నిలిపేందుకు ప్రశాంత్‌ నీల్‌ స్క్రిప్ట్‌పై ఏళ్ల తరబడి కసరత్తు చేశాడు. రవి బస్రూర్‌ సంగీతంతో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రశాంత్‌ నీల్‌ ఫిల్మోగ్రఫీలో బెస్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. అభిమానుల్లో హైప్‌ ఆకాశాన్ని తాకుతోంది