
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. జూన్ మూడో వారం నుంచి హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాల షూటింగ్ ప్రారంభం కానుంది. హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకు హైలైట్గా నిలవనున్నాయి. ఎన్టీఆర్తో పాటు ప్రకాష్ రాజ్, ఇతర కీలక నటీనటులు ఈ షూటింగ్లో పాల్గొననున్నారు. ‘డ్రాగన్’గా పిలువబడుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్లో ఐకానిక్గా నిలిపేందుకు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్పై ఏళ్ల తరబడి కసరత్తు చేశాడు. రవి బస్రూర్ సంగీతంతో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రశాంత్ నీల్ ఫిల్మోగ్రఫీలో బెస్ట్గా నిలిచే అవకాశం ఉంది. అభిమానుల్లో హైప్ ఆకాశాన్ని తాకుతోంది