
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే, ఈ సమయంలో చిత్ర బృందానికి ఊహించని సమస్య ఎదురైంది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డ్రైవ్ అదృశ్యమైందని తెలుస్తోంది. ఈ ఘటనతో యూనిట్ ఆందోళనలో మునిగింది. హార్డ్ డ్రైవ్ ఎలా మాయమైందనే దానిపై చిత్ర బృందం దర్యాప్తు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ తారాగణం నటిస్తోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఘటన సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ 30 నిమిషాల గెస్ట్ రోల్ సినిమాకు హైలైట్గా నిలవనుందని చిత్ర బృందం తెలిపింది. అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.