
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తొలిసారి సందడి చేశారు. రెడ్ కార్పెట్పై ఆమె అందమైన లుక్స్ కెమెరాలను ఆకర్షించాయి. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలు వైరల్గా మారాయి. మే 24 వరకు జరిగే ఈ ఉత్సవంలో జాన్వీ గ్లామర్ హైలైట్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్తో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది. ‘దేవర’ విజయంతో ఊపు మీదున్న జాన్వీ, ‘పెద్ది’ హిట్ అయితే తెలుగులో ఆఫర్లు క్యూ కడతాయని అభిమానులు ఆశిస్తున్నారు.