
‘హనుమాన్’ బ్లాక్బస్టర్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా షూటింగ్ ముంబైలోని చారిత్రాత్మక గుహల్లో ప్రారంభమైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్లో తేజ సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్గా, రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా 8 భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో ఆగస్టులో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. షూటింగ్ షెడ్యూల్ స్పీడ్గా సాగుతోంది. కొత్త షెడ్యూల్లో తేజతో పాటు పలు కీలక పాత్రలు పాల్గొంటున్నాయి. ఈ చిత్రం తేజ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.