
రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం అభిమానుల్లో జోష్ నింపుతోంది. హైదరాబాద్లో ల్యాండ్ అయిన ప్రభాస్, ‘రాజా సాబ్’ డబ్బింగ్తో పాటు ఈ సినిమా షూటింగ్లో రెండు రోజుల్లో జాయిన్ కానున్నారు. నెలన్నర రోజుల ఈ షెడ్యూల్లో సినిమా కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుగనుంది. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. హను రాఘవపూడి స్టైలిష్ యాక్షన్, ఎమోషనల్ కథాంశంతో అదరగొట్టనున్నారని అంచనాలు నెలకొన్నాయి. ఈ అప్డేట్తో ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగిపోయారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి, ఈ కాంబో బాక్సాఫీస్ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.