‘ఖలేజా’ రీరిలీజ్ రచ్చ – అత్యంత భారీగా

Screenshot 2025 05 19 163815

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ మే 30న రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో 2010లో విడుదలైన ఈ సోషియో డ్రామా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, ఆ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇప్పటికీ అభిమానుల్లో ఈ సినిమాపై క్రేజ్ అపారం. మేకర్స్ ‘ఖలేజా’ను గ్రాండ్‌గా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 50 సెకన్ల మాషప్ వీడియోను జూ. ఎన్టీఆర్ ‘యమదొంగ’ రీరిలీజ్‌తో అటాచ్ చేసి ప్రదర్శిస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఈ మాషప్ చూపించనున్నారు. మహేష్ ఫ్యాన్స్‌తో థియేటర్లు ఊగిపోనున్నాయి. ‘ఖలేజా’ రీరిలీజ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మహేష్ మ్యాజిక్ మళ్లీ థియేటర్లలో రచ్చ చేయనుంది!