
సూపర్స్టార్ రజనీకాంత్తో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ భారీ చిత్రం చేసే అవకాశం కొట్టేశారు. ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ వంటి హిట్స్తో గుర్తింపు పొందిన వివేక్, రజనీ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. రజనీ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో సత్తా చాటిన మైత్రీ, రజనీతో సంచలన ప్రాజెక్ట్ను లైన్లో పెట్టింది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. యంగ్ హీరోలతో విభిన్న కథలతో మెప్పించిన వివేక్, రజనీని ఎలా చూపిస్తారనే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా కోలీవుడ్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తుందని అంటున్నారు.