
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్, చరణ్ లుక్స్తో అభిమానులను ఆకట్టుకుంది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత, రామ్ చరణ్ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కొత్త సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ అభిమానుల్లో ఉత్తేజాన్ని రేకెత్తిస్తోంది. గతంలో ఈ జోడీ సినిమా ప్లాన్ ఆగిపోయినప్పటికీ, ఈసారి ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ పొందినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ స్టైలిష్ నరేషన్, చరణ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ కలిస్తే బాక్సాఫీస్లో సంచలనం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.