
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, టాలీవుడ్లో ఓ ఆసక్తికర వార్త తెగ చక్కర్లు కొడుతోంది. తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ బాలయ్యకు ఓ కొత్త కథ వినిపించినట్లు, దానికి బాలయ్య ఓకే చెప్పినట్లు సమాచారం. అధిక్ ఇటీవల అజిత్ కుమార్తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బాక్సాఫీస్ విజయం సాధించారు. ఇప్పుడు బాలయ్యతో కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ బాలయ్య ఇమేజ్కు తగ్గ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని టాక్. అయితే, ఈ వార్తపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.