
శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పాజిటివ్ టాక్తో ఈ చిత్రం రోజురోజుకూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడో రోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ, వారం ప్రారంభంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, ఒక్క ఆదివారం నాడే రూ. 5.1 కోట్లు సాధించింది. బుక్మైషోలో గత 24 గంటల్లో 66 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడవగా, మొత్తం టిక్కెట్ సేల్స్ 2 లక్షల మార్కును అధిగమించాయి. ఓవర్సీస్లోనూ ‘సింగిల్’ జోరు కనిపిస్తోంది. యూఎస్ఏలో $400K దాటి, అర మిలియన్ డాలర్ల లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. మరిన్ని వసూళ్లతో ‘సింగిల్’ సంచలనం సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.