
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ చిత్ర సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కు బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ జోడయ్యారు. వరల్డ్వైడ్ రిలీజ్కు భూషణ్ కుమార్ సమర్పణలో ‘జై హనుమాన్’ రానుంది. ఈ బిగ్ అడిషన్తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. త్వరలో షూటింగ్ ఫుల్ స్వింగ్లో మొదలుకానుంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్లో మరో బ్లాక్బస్టర్ రాబోతుందని అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు.