
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్గా త్రిప్తి డిమ్రీ ఎంపికైంది. ఈ అవకాశంతో ఆమె ఆనందంలో మునిగిపోయింది. ఈ చిత్రంలో నటించేందుకు త్రిప్తి రూ. 4 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఈ భారీ పారితోషికంతో ఆమె కెరీర్లో కొత్త ఒరవడి సృష్టించింది. ముందుగా ఈ పాత్ర కోసం దీపికా పదుకొణె పేరు వినిపించినా, ఆమె రూ. 20 కోట్లకు పైగా డిమాండ్ చేయడం, షూటింగ్ షెడ్యూల్లో మార్పులు కోరడంతో త్రిప్తి ఎంట్రీ ఇచ్చింది. యానిమల్ చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు పొందిన త్రిప్తి, ఈ చిత్రంతో తెలుగు తెరపైకి అడుగుపెడుతుంది. ప్రభాస్తో జోడీ కట్టడం ద్వారా ఆమె కెరీర్ మరింత ఉజ్వలంగా మారనుంది