
హీరోయిన్ తండ్రి మృతి టాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి రామన్ రాయ్(72) అనారోగ్యంతో నిన్న ముంబైలోని నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో తెలియజేశారు. తమ కుటుంబానికి ఆయనే మూలస్తంభం అని రాసుకొచ్చారు. కాగా రేపు ముంబైలోని అంబోలి స్మశానవాటికలో మ. 1 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలుగులో మన్నారా జక్కన్న, రోగ్, తిక్క తదితర చిత్రాల్లో నటించారు.