
హనుమాన్ సినిమా విజయంతో తేజ సజ్జా జాగ్రత్తగా కెరీర్ను మలుచుకుంటున్నాడు. మిరాయ్ సినిమా చేస్తూ కొత్త కథల ఎంపికలో బిజీగా ఉన్నాడు. డిజే టిల్లు దర్శకుడు మల్లిక్ రామ్తో మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. గతంలో తేజతో కలిసి మల్లిక్ తీసిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అద్భుతం ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందన పొందింది. అయితే, ఈసారి వీరిద్దరూ కలిసి చేయబోయే సినిమా మరింత పెద్ద స్కేల్లో, వైవిధ్యమైన కాన్సెప్ట్తో రూపొందనుంది. కథ కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హనుమాన్ తర్వాత తేజ ఎంచుకుంటున్న కథలు, దర్శకులపై అందరి దృష్టి నిలిచింది. ఈ కొత్త సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.