
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు రేపుతోంది. ఈ చిత్రం తర్వాత చరణ్, సుకుమార్తో 17వ సినిమాకు సిద్ధమవుతున్నారు. సుకుమార్ తాజాగా మలికిపురంలో ఈ ప్రాజెక్ట్ గురించి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. చరణ్ అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.