
టాలీవుడ్ యువ నటుడు శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్తో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల విడుదలైన సింగిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు రూపొందించారు. విడుదలైన తొలి రోజు నుంచి అద్భుతమైన టాక్తో దూసుకెళ్తున్న ఈ సినిమా, శ్రీవిష్ణు కెరీర్లో మరో విజయాన్ని నమోదు చేసింది. వారం రోజుల్లో కూడా వసూళ్లు తగ్గకుండా కొనసాగుతున్న సింగిల్, యూఎస్ మార్కెట్లో అర మిలియన్ డాలర్ల సమీపంలో రికార్డు సృష్టించింది. కామెడీ, కంటెంట్ల మిళితంతో యువతను ఆకర్షిస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ విజయంతో శ్రీవిష్ణు తన స్థానాన్ని టాలీవుడ్లో మరింత బలపరిచాడని సినీ వర్గాలు అంటున్నాయి.