
శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు డైరెక్షన్లో వచ్చిన ‘సింగిల్’ బాక్సాఫీస్ను కుదిపేస్తోంది. ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ ఫుల్ ఎంటర్టైనర్ 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రెండో వీకెండ్లోనూ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 30 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, గీతా ఆర్ట్స్ సమర్పణలో విడుదలైన ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్లో సూపర్ హిట్గా నిలిచింది. యూత్ను ఆకర్షించిన కథ, కామెడీ టైమింగ్తో సినిమా రాణిస్తోంది. శ్రీవిష్ణు నటనకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మరథం పడుతోంది. ఈ సినిమా విజయం శ్రీవిష్ణు రేంజ్ను మరోస్థాయికి తీసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద ‘సింగిల్’ జోరు ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి!