
బాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్లో తనకు ఇల్లు గిఫ్ట్గా వచ్చిందన్న గాసిప్పై తొలిసారి స్పందించింది. “ఆ ఇల్లు నేనే సొంతంగా కొన్నాను. మా నాన్న పత్రాలను స్వయంగా పరిశీలించారు. ఈ రూమర్ విని ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఈ విషయంలో గట్టిగా స్పందించు’ అని చెప్పారు” అని రకుల్ వెల్లడించింది. అలాంటి నీచమైన వార్తలకు సమాధానం ఇవ్వడం వ్యర్థమని, అటువంటి పోర్టల్స్ను పట్టించుకోనని స్పష్టం చేసింది. తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా రాణించిన రకుల్, ఇప్పుడు బాలీవుడ్లో సత్తా చాటుతోంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న ఆమె, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజా ప్రాజెక్ట్లతో రకుల్ మరింత గ్లామర్గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.