
సినీ రంగంలో నటకిరీటిగా వెలుగొందుతున్న రాజేంద్ర ప్రసాద్, ఇటీవలి కాలంలో తన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ‘రాబిన్ హుడ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ను అనుచితంగా సంబోధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. క్షమాపణ చెప్పినప్పటికీ, మరో ఈవెంట్లో అల్లు అర్జున్పై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా, ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదినోత్సవంలో కమెడియన్ అలీని అసభ్యంగా సంబోధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముప్పై ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో సంపాదించిన గౌరవం ఈ సంఘటనలతో క్షీణిస్తోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాటల విషయంలో జాగ్రత్త వహించకపోతే, ఆయన సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలు దెబ్బతినే ప్రమాదం ఉందని సినీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.