
నటి పూనమ్ కౌర్ తాజా ఆరోపణలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్షాట్లతో సహా, “త్రివిక్రమ్ను వదిలేది లేదు, ఆధారాలు ఉన్నాయి” అని పూనమ్ పేర్కొన్నారు. ‘మా’ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ వెనుక రాజకీయ మద్దతు ఉందని ఆమె ఆరోపించారు. ఈ వివాదంపై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. పూనమ్ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.