
భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మే 7న భారత సైన్యం పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులతో సంచలనం సృష్టించింది. చిరంజీవి, రితీష్ దేశ్ముఖ్ లాంటి స్టార్స్ ఈ ఆపరేషన్కు ఓపెన్గా సపోర్ట్ చేశారు. కానీ బాలీవుడ్ బిగ్గీస్ షారుఖ్, అమీర్, సల్మాన్ నోరు మెదపకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్షయ్ కుమార్ మినహా ఎవరూ స్పందించకపోవడం హాట్ డిబేట్గా మారింది.
సల్మాన్ ఖాన్ మాత్రం మే 10న “Thank God for the ceasefire” అని ట్వీట్ చేసి, కాసేపటికే డిలీట్ చేసి వివాదంలో చిక్కారు. ఆపరేషన్ సిందూర్పై మౌనం, సీజ్ఫైర్పై స్పందనతో సల్మాన్పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో #BoycottSalmanKhan ట్రెండ్తో రచ్చ మొదలైంది. సల్మాన్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వకపోవడంతో వివాదం మరింత హీటెక్కింది.