పూరి-విజయ్ సేతుపతి సినిమాలో నిహారిక ఎంట్రీ?

Screenshot 2025 05 12 114056

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై సినీ లవర్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించనుండగా, సోషల్ మీడియా స్టార్, నటి నిహారిక ఎన్ఎం కూడా ఈ సినిమాలో జాయిన్ అయినట్లు టాక్. ‘పెరుసు’ చిత్రంలో సున్నితమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిహారిక, ఇప్పుడు పూరి జగన్నాధ్ సినిమాలో ఎలాంటి రోల్‌లో సందడి చేస్తుందనేది హాట్ టాపిక్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా సంచలనాత్మకంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. పూరి మార్క్ యాక్షన్, విజయ్ సేతుపతి డెప్త్ నటన, నిహారిక ఫ్రెష్ ఎనర్జీ.. ఈ కాంబో బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుంది? అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.