
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 157వ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ భారీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసిన చిత్ర బృందం, ఇప్పుడు రెండో షెడ్యూల్ను ఉత్తరాఖండ్లోని సుందరమైన ముస్సోరి లొకేషన్స్లో ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు నయనతార, ఇతర కీలక నటీనటులు పాల్గొంటున్నారు.
ఈ రెండో షెడ్యూల్లో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ డైలాగ్లతో కూడిన కీలక సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. షూటింగ్ను శరవేగంతో పూర్తి చేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. చిరంజీవి ఫ్యాన్స్కు ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్గా నిలవనుందని టాక్.