
మెగాస్టార్ చిరంజీవి తన భారీ చిత్రం విశ్వంభరతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమా విడుదల కాకముందే చిరు మరో బిగ్ ప్రాజెక్ట్తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందిస్తున్న చిరంజీవి 157వ చిత్రం ఊహించని వేగంతో ముందుకు సాగుతోంది.
ఇప్పటికే ఒక షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం రెండో షెడ్యూల్కి సిద్ధమైంది. ఈ సారి చిత్ర బృందం డెహ్రాడూన్లో షూటింగ్ ప్లాన్ చేస్తోంది. మెగాస్టార్తో పాటు టీమ్ ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ షెడ్యూల్లో హై వోల్టేజ్ సీన్స్ను చిత్రీకరించనున్నారని సమాచారం. అనీల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ని రాకెట్ స్పీడ్లో తీసుకెళ్తున్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు భీమ్స్ స్వరాలు సమకూరుస్తుండగా, షైన్ స్క్రీన్స్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తోంది. లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్గా విడుదల కానుంది. చిరు ఫ్యాన్స్కి ఈ చిత్రం ఓ విజువల్ ట్రీట్గా నిలవనుందని చిత్ర యూనిట్ అంటోంది. మెగాస్టార్ జోరు చూస్తుంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ఉరకలు వేస్తున్నారు.