
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయినా, ఇప్పుడు ఈ సినిమా అభిమానుల హృదయాల్లో సునామీ సృష్టిస్తోంది. రీరిలీజ్లో ఈ సినిమా మొదటి రోజు నుంచే ఊహించని రికార్డులు నమోదు చేసింది. రిలీజ్కు ఇంకా రెండు రోజులు ఉండగానే, ప్రపంచవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ప్రీ సేల్స్ సాధించి, రీరిలీజ్ డే-1లో సరికొత్త బెంచ్మార్క్ సెట్ చేసింది. అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మణిశర్మ సంగీ మరియు నేపథ్య సంగీతం ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్తో అలరించిన ఈ సినిమా, రీరిలీజ్తో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం.