
మంచు విష్ణు నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగాల్సిన ఈ భారీ ఈవెంట్ కోసం అన్ని భాషల మీడియా సిద్ధంగా ఉంది. తెలుగు మీడియా బృందాలు రేపు ఉదయం ఫ్లైట్లో బయల్దేరేందుకు రెడీ అయ్యాయి. కానీ, గుజరాత్లోని అహ్మదాబాద్లో సంభవించిన విమాన దుర్ఘటన కారణంగా విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. మృతులకు నివాళిగా, బాధిత కుటుంబాలకు సంతాపంగా ఈవెంట్ను ఒక రోజు పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. “ఈ దుర్ఘటనలో బాధితుల కుటుంబాలకు నా హృదయపూర్వక ప్రార్థనలు” అని విష్ణు తెలిపారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్-ఇండియా సినిమా, ఎన్నో ఆటంకాలను అధిగమించి ఈ నెల 27న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లతో ‘కన్నప్ప’ అంచనాలను ఆకాశానికి తాకిస్తోంది.