
యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన టాలెంటెడ్ నటుడు ఉపేంద్ర లిమాయె మరోసారి చర్చల్లో నిలిచారు. కేవలం కొన్ని సీన్లలోనే నటనతో గట్టి ముద్ర వేసిన ఈ నటుడు, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటు ఇటీవల విడుదలైన జాట్ సినిమాలోనూ మెరిశాడు. ఇప్పుడు మరోసారి సందీప్ రెడ్డి వంగతో కలిసి కనిపించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
భద్రకాళి ఆఫీస్లో రెడ్డి బ్రదర్స్తో కలిసి ఉపేంద్ర లిమాయె దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగాస్టార్కు సంబంధించిన ఓ ఫ్రేమ్ ముందు ఈ కాంబో కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. దీంతో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. మొత్తానికి ఈ క్రేజీ కాంబో సినీ ప్రియులకు భారీ అంచనాలను పెంచుతోంది.