
విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన కీలక హార్డ్ డిస్క్ చోరీకి గురైందని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి కొరియర్లో పంపిన ఈ హార్డ్ డిస్క్లో రెండు ముఖ్య పాత్రల యాక్షన్ దృశ్యాలు, వీఎఫ్ఎక్స్ విజువల్స్ ఉన్నాయని తెలిపింది. చరిత అనే మహిళ సమాచారంతో రఘు అనే వ్యక్తి ఈ డిస్క్ను తీసుకుని పరారయ్యాడని, వీరిద్దరికీ తమ సంస్థతో సంబంధం లేదని స్పష్టం చేసింది. 90 నిమిషాల ఫుటేజ్ను ఆన్లైన్లో లీక్ చేసేందుకు కుట్ర జరిగిందని, ఇది వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన నీచమైన చర్య అని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నప్ప టీమ్, కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ ఘటన సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది.