
మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత అనిల్ తీస్తున్న ఈ సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. చిరంజీవి కామెడీ, యాక్షన్తో కూడిన పవర్ఫుల్ రోల్లో థియేటర్లలో రచ్చ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్మించిన భారీ సెట్లో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఫైట్ సీక్వెన్స్లతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు టీమ్ రెండో షెడ్యూల్ కోసం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు వెళ్లనుంది. 25-30 రోజుల షూటింగ్ ప్లాన్ చేశారు. నయనతార, కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం, అనిల్ మార్క్ కామెడీ, చిరు చరిష్మాతో 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ను షేక్ చేయనుంది.