చరణ్-వెంకీ మల్టీస్టారర్ రచ్చ – త్రివిక్రమ్ మాయ మొదలైంది

Screenshot 2025 05 20 075229

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ సినిమా వాయిదా పడటంతో, త్రివిక్రమ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఆసక్తికరంగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మల్టీస్టారర్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం ఓ భారీ చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ, సుకుమార్ సినిమాకు ముందు త్రివిక్రమ్‌తో ఈ ప్రాజెక్ట్‌లో కనిపించనున్నారు. గతంలో వెంకీ, పవన్ కళ్యాణ్‌తో ‘గోపాల గోపాల’ చేసిన చరిత్ర ఉంది. ఈ క్రమంలో చరణ్-వెంకీ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.