మహా న్యూస్ మీడియా సంస్థ పై దాడి

Screenshot 2025 06 28 151143

తెలుగు న్యూస్ ఛానల్ అయినటువంటి మహా న్యూస్ ఆఫీస్ పై, వారి యాజమాన్యంపై బిఆర్ఎస్ నేతలు కొంతమంది దాడి చేయడం జరిగింది. ఓ వార్తకు సంబంధించిన విషయంపై కొంతమంది బిఆర్ఎస్ నేతలు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కొంతమంది మహా న్యూస్ యాజమాన్యానికి గాయాలు కాగా ఎంతో విలువైనటువంటి కంప్యూటర్లు, ఇతర ఛానల్ కు సంబంధించిన సామాగ్రి నాశనం కావడం జరిగింది. బిల్డింగ్ అద్దాలను పగలగొట్టారు.

దీనిపై మహా న్యూస్ యాజమాన్యం స్పందిస్తూ స్వతంత్ర భారతదేశంలో మీడియాపై దాడి అనేది ఎంతో సిగ్గుపడాల్సిన విషయమని, తమ ఛానల్ పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని అంటున్నారు. మీడియా హక్కు అయినటువంటి వాక్ స్వతంత్రాన్ని ఇలా దాడులతో ఆపలేరని అన్నారు.