ఇలియానా సినీ రీ-ఎంట్రీ సంచలనం.. అభిమానులకు గుడ్ న్యూస్

Ileana DCruz

సీనియర్ హీరోయిన్ ఇలియానా డి’క్రజ్ సినిమాలకు దూరమైనా, అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించింది. 2023లో తల్లి కావడంతో సినీ కెరీర్‌కు తాత్కాలిక విరామం ఇచ్చిన ఆమె, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘రైడ్ 2’లో నటించకపోవడంపై ఓ నెటిజన్ ప్రశ్నించగా, ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. “‘రైడ్’ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకం. మాలిని పాత్రలో మళ్లీ నటించాలని కలలు కన్నా. రాజ్‌కుమార్ గుప్తా, అజయ్ దేవ్‌గణ్‌తో మళ్లీ కలిసి పనిచేయాలనుంది. ‘రైడ్ 2’ కోసం టీమ్ సంప్రదించినప్పుడు నా బాబు జన్మించాడు, అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నా,” అని ఇలియానా తెలిపింది. త్వరలో సినీ రంగంలోకి రీ-ఎంట్రీ ఇస్తానని హామీ ఇవ్వడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆమె కమ్‌బ్యాక్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు, ఇలియానా మళ్లీ స్క్రీన్‌పై మ్యాజిక్ సృష్టించే సమయం దగ్గరపడింది.